PM Modi: రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తి: ప్రధాని మోదీ

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ  ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.

Updated : 14 Jan 2022 01:52 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ  ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల గురించి వారితో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్న మోదీ..  వైరస్‌ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించి ఏడాది పూర్తి కావొస్తోందని తెలిపారు.  పదిరోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్‌ టీకా పూర్తి చేసినట్లు చెప్పారు. త్వరితగతిన కొవిడ్‌ టీకా భారత్‌ సామర్థ్యాన్ని తెలుపుతోందన్నారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో కొవిడ్‌టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషన్‌ డోస్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయిందని ప్రధాని వివరించారు. తెంగాణ రాష్ట్రం నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు