బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌కు అస్వస్థత 

బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్‌లోని కింగ్‌ అడ్వర్డ్‌ ఆస్పత్రిలో మంగళవారం .....

Published : 18 Feb 2021 01:42 IST

లండన్‌: బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్‌లోని కింగ్‌ ఎడ్వర్డ్‌ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం చేరి చికిత్స తీసుకుంటున్నారని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 99 ఏళ్లు. క్వీన్‌ ఎలిజిబెత్‌ -II భర్త అయిన ఫిలిప్‌.. తన వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే పరిశీలనలో ఉండి విశ్రాంతి తీసుకుంటారని ప్యాలెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌తో బ్రిటన్‌లో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాణితో కలిసి ఫిలిప్‌ వెస్ట్‌ లండన్‌లోని విండ్సోర్‌ రాజభవనంలోనే ఉంటున్నారు. జనవరి నెలలో క్వీన్‌ ఎలిజిబెత్‌, ఫిలిప్‌ తొలి డోసు కొవిడ్‌ టీకాను తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని