Precaution Dose: మహమ్మారి నుంచి మరింత సురక్షితం.. మొదలైన ప్రికాషన్ డోసు
దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో వచ్చాయి.......
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉంచేందుకు 18 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో వచ్చాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలు కూడా తగ్గడంతో మూడో డోసు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు తర్వాత తొమ్మిది నెలలు పూర్తయినవారు ఈ మూడో డోసు తీసుకునేందుకు అర్హులు.
ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న ప్రికాషన్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. కాగా ఇప్పటివరకు 2.4 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైనున్నవారికి ఈ డోసును పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూర్తయ్యింది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.
ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానున్న ఒకరోజు ముందే (శనివారం) వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులకు కొవాగ్జిన్ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. అయితే ఈ టీకా ధరలకు సర్వీసు ఛార్జీ అదనం. ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు కేంద్రాలను సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్