Priyanka Gandhi: మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంది.. వేధించడం ఆపండి..!

కర్ణాటకను కుదిపేస్తోన్న హిజాబ్ వివాదంపై బుధవారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే విషయంలో ఆమె విద్యార్థినులకు మద్దతుగా ట్వీట్ చేశారు. దుస్తుల ఎంపిక మహిళల ఇష్టమని, ఇది రాజ్యాంగ పరమైన హక్కు అని స్పష్టం చేశారు.

Published : 09 Feb 2022 15:45 IST

దిల్లీ: కర్ణాటకను కుదిపేస్తోన్న హిజాబ్ వివాదంపై బుధవారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే విషయంలో ఆమె విద్యార్థినులకు మద్దతుగా ట్వీట్ చేశారు. దుస్తుల ఎంపిక మహిళల ఇష్టమని, ఇది రాజ్యాంగ పరమైన హక్కు అని స్పష్టం చేశారు.

‘ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉంది. ఇది రాజ్యాంగం హమీ ఇచ్చిన హక్కు. మహిళలను వేధించకండి’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. అలాగే ladkihoonladsaktihoon అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. మహిళలు పోరాడగలరనేది దీనర్థం. ఈ నినాదంతో ఆమె యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. హిజాబ్ వివాదంపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మద్దతు పలికారు. 

దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మంగళవారం హిజాబ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని