Priyanka Gandhi: బారికేడ్లు దూకి ప్రియాంక గాంధీ ధర్నా.. బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతిభవన్, ప్రధాని
దిల్లీ: ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతిభవన్, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు హస్తం పార్టీ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆందోళనల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దేశ రాజధానిలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ నేడు పిలుపునివ్వగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాయలం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కాంగ్రెస్ నేతలను ర్యాలీకి అనుమతించలేదు. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి దూకి రోడ్డుపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఇక్కడ నిషేదాజ్ఞలు ఉన్నందున ధర్నా చేయొద్దని పోలీసులు ఆమెకు సూచించారు. కానీ ఆందోళనను విరమించేందుకు ప్రియాంక ఒప్పుకోకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ నేతలు ట్విటర్లో పోస్ట్ చేస్తూ కేంద్రంపై మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ఓ మహిళా నేత పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఆందోళనల సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..‘‘ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారు. అందుకే మేం ప్రధాని ఇంటి వరకూ వెళ్లి చూపించాలనుకుంటున్నాం. కానీ వారు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) మాపై దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
అంతకుముందు పార్టీ ఎంపీలతో కలిపి రాహుల్ గాంధీ పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే విజయ్ చౌక్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ప్రియాంక, రాహుల్ పోలీసుల అదుపులోనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో