
Farm Laws: సాగు చట్టాల రద్దు.. రైతు నేత టికాయత్ ఏమన్నారంటే..!
ఘాజియాబాద్: నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ స్పందించారు. చట్టాల రద్దుపై ప్రకటన చేసినప్పటికీ తాము ఉద్యమాన్ని ఇప్పుడే ఆపబోమని అన్నారు. ‘‘ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోం. పార్లమెంట్లో మూడు చట్టాల రద్దు జరిగే రోజు వరకూ ఎదురుచూస్తాం. ఇక కనీస మద్దతు ధరతో పాటు మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉంది’’ అని టికాయత్ ట్వీట్ చేశారు.
సరిహద్దుల్లో సంబరాలు..
సాగు చట్టాల రద్దు మోదీ ప్రకటన చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళన పాల్గొన్న రైతు నేతలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కేంద్రం నిర్ణయంపై సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంట్లో ప్రక్రియ పూర్తయిన తర్వాతే చట్టాల రద్దు అమల్లోకి వస్తుంది. అది జరిగితే.. ఏడాది పాటు రైతులు సాగించిన పోరాటానికి చారిత్రక విజయం లభించినట్లే’’ అని ఎస్కేఎం వెల్లడించింది.
గతేడాది సెప్టెంబరులో మూడు నూతన సాగు చట్టాలను కేంద్రం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దేశంలో పలు చోట్ల అన్నదాతలు ఆందోళనలు, ధర్నా చేపట్టారు. గతేడాది నవంబరు 25న పంజాబ్, హరియాణా నుంచి వేలాది మంది రైతులు ‘చలో దిల్లీ’ పేరిట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని సరిహద్దుల్లోనే బైఠాయించారు. నాటి నుంచి ఏడాదిగా సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు విడతల్లో చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఆందోళనలకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఇటీవల రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: కేసీఆర్.. నయా భూస్వాములను తయారు చేస్తున్నారు: రేవంత్రెడ్డి
-
India News
Booster Dose: బూస్టర్ డోసు వ్యవధి ఇక 6 నెలలే
-
Sports News
IND VS WI: వెస్టిండీస్తో వన్డేలకు భారత జట్టు ఇదే
-
World News
North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా
-
Politics News
Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
-
India News
Mukhtar Abbas Naqvi: కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!