Corona: పుదుచ్చేరి సీఎంకు పాజిటివ్‌ 

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రంగస్వామి కరోనా బారిన పడ్డారు.

Updated : 10 May 2021 08:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కరోనా బారిన పడ్డారు. సీఎంగా ప్రమాణం చేసిన నాలుగు రోజులకు ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాలలో రంగస్వామికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స కోసం ఆయన చెన్నై వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 7న సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన 11 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు సమాచారం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని