Bhagwant Mann: ‘ఇకపై క్యూ అవసరం లేదు.. మీ ఇంటి వద్దకే రేషన్!’
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పేదలు ఇకపై రేషన్ దుకాణాల ముందు బారులు తీరాల్సిన అవసరం లేదనీ.. ......
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటన
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పేదలు ఇకపై రేషన్ దుకాణాల ముందు ప్రజలు బారులు తీరాల్సిన అవసరం లేదనీ.. వారి ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ను సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్ మాత్రమేనన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘‘రేషన్ సరకుల్ని ప్రజల ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కింద నాణ్యమైన రేషన్ సరకుల్ని లబ్ధిదారులకు అందించబోతున్నాం. ఇకపై ఎవరూ క్యూలలో ఉండాల్సినవసరంలేదు/దీని కోసం సెలవు పెట్టాల్సిన పనీలేదు. మా అధికారులే లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు అనువైన సమయంలో వచ్చి సరకులు పంపిణీ చేస్తారు. ఈ పథకం ఐచ్ఛికమే. ఎవరికైనా రేషన్ డిపో దగ్గర్లోనే ఉంటే వారు వెళ్లైనా తెచ్చుకోవచ్చు’’ అన్నారు.
‘‘దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. కానీ పంజాబ్లో ఈ పథకాన్ని అమలు చేస్తాం. విజయవంతంగా కొనసాగిస్తాం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా పేదలు, సామాన్యులు సరకులు పొందేందుకు ఇప్పటికీ రేషన్ డిపోల ముందు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ డిజిటల్ యుగంలో అనేక ఆహార వస్తువులు, నిత్యావసరాలు ఒక్క ఫోన్ కాల్తో ఇంటి ముంగిటకు వచ్చిపడుతున్నాయి. కానీ, పేదలు.. ముఖ్యంగా దినసరి వేతనానికి పనిచేసేవారు రేషన్ కోసం ఆరోజు తమ పనిని వదులుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ పూటగడవని కుటుంబాలు రేషన్ కోసం పని మానుకోవడం ఎంతో బాధాకరం. అనేకమంది వృద్ధ మహిళలు రెండు కి.మీల మేర నడిచి వెళ్లి రేషన్ డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడం నాకు తెలుసు. ఇలాంటి కష్టాలు ఇకపై ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు ఉండాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు’’ అన్నారు.
పంజాబ్లో మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్లు!
మరోవైపు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటనపై దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం ప్రకటించారు. పంజాబ్ సీఎం ప్రకటన ఎంతో గొప్పదనీ.. ఇది పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఒకసారి పంజాబ్లో ఇంటివద్దకే రేషన్ సరకుల పంపిణీ పథకం మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల్లో ఈ డిమాండ్ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఈ పథకాన్ని మొదలుపెట్టేందుకు తాము ప్రయత్నించగా.. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలుకాకుండా అడ్డుపడిందని ఆరోపించారు. ఆలోచనకు సమయం వస్తే.. అది ఆగదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..