రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది!

అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అంతా అలా జరిగిపోతుందంతే..! రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌ ఓ గృహిణిని......

Updated : 26 Feb 2021 04:37 IST

లాటరీ రూపంలో గృహిణిని వరించిన అదృష్టం

అమృత్‌సర్‌: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అంతా అలా జరిగిపోతుందంతే..! రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌ ఓ గృహిణిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్‌కు చెందిన రేణూ చౌహాన్‌ ఇటీవల రూ.100లకు లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశారు. లాటరీ తీయగా ఆమె టిక్కెట్‌ ప్రైజ్‌ విన్నర్‌గా నిలిచినట్టు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్ర లాటరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో లాటరీ టిక్కెట్‌తో పాటు అవసరమైన దస్త్రాలను అధికారులకు ఆమె గురువారం సమర్పించారు.

భగవంతుడి ఆశీస్సుల వల్లే తనకు ఈ లాటరీ తగిలిందంటూ రేణూ చౌహాన్‌ అమితానందం వ్యక్తంచేశారు. మధ్యతరగతి కుటుంబమైన తనకు ఇదెంతో ఉపశమనం కలిగించిందన్నారు. తన భర్త అమృత్‌సర్‌లో వస్త్ర దుకాణం నడుపుతున్నారని చెప్పారు. ఈ లాటరీ ప్రైజ్‌ మనీ తమ జీవితం మరింత సజావుగా సాగేందుకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు రేణు. ఈ లాటరీ ఫలితాలను ఈ నెల 11న ప్రకటించినట్టు లాటరీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. రేణు గెలిచిన టిక్కెట్‌ నంబర్‌ డి-12228 అని, నగదును పొందేందుకు అవసరమైన దస్త్రాలను ఆమె సమర్పించారన్నారు. ప్రైజ్‌ మనీని త్వరలోనే ఆమె బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని