రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా!
‘ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. మానసిక సమస్యలతో బాధపడుతుంటే కుటుంబంలో ఎవరూ సాయం చేయలేదు సరికదా.
తోడికోడలు కేట్ వల్ల ఏడ్చా
సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు
న్యూయార్క్: ‘‘ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. మానసిక సమస్యలతో బాధపడుతుంటే కుటుంబంలో ఎవరూ సాయం చేయలేదు సరికదా.. నాపై నిందలు వేశారు. వీటివల్ల ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి’’ అంటూ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ భావోద్వేగానికి గురయ్యారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన ఈ దంపతులు తొలిసారిగా ఓ టీవీ షోలో మాట్లాడారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వీరు.. సంచలన విషయాలు వెల్లడించారు.
చచ్చిపోదామనకున్నా..
‘‘హ్యారీని పెళ్లి చేసుకోకముందు రాచరికపు జీవితం గురించి నాకు ఏమాత్రం తెలియదు. రాణి ముందు ఎలా ఉండాలి అనేది కూడా అవగాహన లేదు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్యాలెస్లోకి వచ్చాక ఇలా ఉండాలి అలా చేయాలంటూ అనేక ఆంక్షలు ఉండేవి. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేది. అలా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా.. రాజకుటుంబంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. పైగా నాపై అసత్య ఆరోపణలు చేశారు. నిందలు వేశారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. రాజకుటుంబంలో నాకు రక్షణ ఉండదని పెళ్లి అయిన కొద్దిరోజులకే అర్థమైంది’’ మేఘన్ చెప్పారు.
కొడుకు రంగు గురించి భయపడ్డారు..
‘‘నేను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగింది. నేను నల్లగా ఉన్నాను కాబట్టి.. నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారు. దీని గురించి హ్యారీతో వారు చర్చించారు. అంతేగాక, మా బిడ్డకు భద్రత ఉండదని, టైటిల్ కూడా రాదని మాట్లాడుకున్నారు’’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కేట్ వల్ల ఏడ్చా..
‘‘రాజకుటుంబంతో నాకు సఖ్యత లేదని, నా వల్ల తోడికోడలు కేట్ ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. పెళ్లి రోజున ఫ్లవర్ గర్ల్ దుస్తుల విషయంలో కేట్ కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డా. ఏడ్చా. అయితే, ఆ తర్వాత కేట్ క్షమాపణలు చెప్పడంతో ఆ సమస్య సద్దుమణిగింది. కానీ బయట మాత్రమే నా వల్లే తప్పు జరిగినట్లు ప్రచారం జరిగింది’’ అని మేఘన్ తెలిపారు.
మూడు రోజుల ముందే రహస్య పెళ్లి..
‘‘2018 మే 19న బ్రిటన్ విండ్సోర్ క్యాస్టిల్లో అధికారికంగా మా వివాహం జరిగింది. అయితే, అంతకంటే మూడు రోజుల ముందే ప్రైవేటుగా మేం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. మా కోసం మేం ఆ వేడుక చేసుకున్నాం’’ అని మేఘన్ చెప్పుకొచ్చారు.
డబ్బులు ఇవ్వడం ఆపేశారు..
ఈ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ కూడా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తను కేవలం మేఘన్ కోసమే రాజకుటుంబం నుంచి బయటకు రాలేదని హ్యారీ తెలిపారు. ‘‘నన్ను ట్రాప్ చేశారు. నాకు ఆ విషయం తెలియలేదు. అందులో నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాలేదు. నా తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్ చేశారు’’ అని అన్నారు. రాచరిక విధుల నుంచి వెనక్కి తగ్గుతున్నాం అని ప్రకటించిన తర్వాత 2020 ఆరంభంలో రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయాని ఆయన తెలిపారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం వదిలివెళ్లిన డబ్బులతో తన కుటుంబానికి భద్రత ఇవ్వగలిగానని చెప్పుకొచ్చారు.
‘‘నా తండ్రి ప్రిన్స్ ఛార్లెస్, సోదరుడు ప్రిన్స్ విలియంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పెళ్లి తర్వాత కుటుంబంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేనెప్పుడూ నా కొడుకుకు రాజకుటుంబలో హోదా రావాలని కోరుకోలేదు. దాని గురించి ఎవరితోనూ చర్చించలేదు. అయినా, సరే మాపై దుష్ప్రచారం జరిగింది. నా తల్లి జీవితంలో జరిగినట్లుగానే నా జీవితంలోనూ జరుగుతుందేమోనని భయపడ్డా. నిస్సహాయ స్థితిలోనే రాజకుటుంబం నుంచి విడిపోదామని నిర్ణయానికి వచ్చా. ఆ ప్రకటన చేసిన తర్వాత కుటుంబం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. తండ్రి తనతో మాట్లాడటం మానేశారు. నన్ను నమ్ముకుని వచ్చిన భార్య, కొడుకు ఆర్చీ భవిష్యత్ కోసమే బయటకు వచ్చేశా’’ అని హ్యారీ వెల్లడించారు.
అమ్మాయి వచ్చేస్తోంది..
ఈ సందర్భంగా హ్యారీ దంపతులు ఓ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తమకు ఆడపిల్ల పుట్టబోతోందని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాను అమ్మాయికి జన్మనివ్వబోతున్నానని మేఘన్ సంతోషంగా చెప్పారు.
బ్రిటన్ రాణి ఎలిజబిత్ 2 మనవడు అయిన ప్రిన్స్ హ్యారీ.. 2018లో అమెరికా నటి మేఘన్ మర్కెల్ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. వారు ఆ తర్వాత మేఘన్ స్వస్థలం కాలిఫోర్నియా వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)