Rahul Dravid: భాజపా సభకు రాహుల్‌ ద్రవిడ్‌.. టీమిండియా కోచ్‌ ఏమన్నారంటే?

హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ హాజరుకానున్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశారు. అవన్నీ నిజం కాదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

Published : 11 May 2022 02:09 IST

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ హాజరుకానున్నట్లు  కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశారు. అవన్నీ నిజం కాదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మే 12 నుంచి 15వ తేదీ వరకు భాజపా యువ మోర్చా నేషనల్ వర్కింగ్‌ కమిటీ సదస్సు జరగనుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన కాషాయ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ సదస్సుకు రాహుల్‌ ద్రవిడ్‌ హాజరుకానున్నారని ధర్మశాల ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా చెప్పినట్లు నిన్న పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ద్రవిడ్‌ ఈ సదస్సులో పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వనున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

మరికొద్ది నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనాలపై ద్రవిడ్‌ నేడు స్పందించారు. ‘‘మే 12-15 మధ్య నేను హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కావు’’ అని ఇండియా కోచ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని