Rahul Gandhi: మంచులో రాహుల్‌-ప్రియాంక ఫైట్‌.. వీడియో వైరల్‌

జోడో యాత్ర( Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సరదాగా గడిపారు. మంచులో ఫైట్‌ చేసుకున్నారు. 

Updated : 30 Jan 2023 13:47 IST

దిల్లీ: కాంగ్రెస్(Congress) అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఫైట్‌ చేశారు. గడ్డకట్టిన మంచులో ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. స్నోబాల్స్‌ విసురుతూ నవ్వులు చిందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర( Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌లో ఈ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఈ దృశ్యాలను రాహుల్ ట్వీట్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది అంతా వెంట ఉన్న సమయంలో రాహుల్ తన సోదరి ప్రియాంకను ఆటపట్టించారు. చాటుగా స్నో బాల్స్‌ తీసుకొని ఆమె తలపై వేశారు. ప్రియాంక కూడా అలాగే తన సోదరుడితో ఆడుకున్నారు. అతడి చేతులు వెనక్కి లాగి, తలపై మంచు ముద్దలు వేశారు. తర్వాత ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మరికొందరిపై కూడా రాహుల్ ఈ స్నోబాల్స్ విసిరారు. అందమైన ఉదయం అంటూ ఈ వీడియోను షేర్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని