Rahul Gandhi: బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ..!
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. యూకే ఉభయసభల ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంగ్లాండ్లో బిజీబిజీగా గడుపుతున్నారు. 10 రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ (Britain) వెళ్లిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా.. ఈ పర్యటనలో ఆయన బ్రిటన్ పార్లమెంట్ (Parliament)లో ప్రసంగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మార్చి 6వ తేదీన వెస్ట్మినిస్టర్ ప్యాలెస్లోని గ్రాండ్ కమిటీ రూమ్లో యూకే (UK) ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత సంతతికి చెందిన యూకే ఎంపీ వీరేంద్ర శర్మ స్పందిస్తూ.. ‘‘కేవలం రాజకీయాలపై మాత్రమే గాక, ఇరు దేశాల మధ్య ఉన్న సంస్కృతి, సామాజిక, వ్యాపార బంధంపై రాహుల్ ప్రసంగం ఉండనుంది’’ అని తెలిపారు.
ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశిస్తూ రాహుల్ (Rahul Gandhi) ప్రసంగించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన లండన్ (London)లోని ప్రవాస భారతీయులతో ఇష్టాగోష్ఠీలో పాల్గొననున్నారు. దీంతో పాటు ఇండియన్ జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. లండన్లోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇక, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ (Rahul Gandhi) ప్రసంగిస్తూ.. భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని, తనతో సహా పలువురు విపక్ష నేతల ఫోన్లపై నిఘా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడి జరుగుతోందని దుయ్యబట్టారు. అయితే ఈ ప్రసంగం భారత్లో తీవ్ర దుమారానికి దారితీసింది. రాహుల్ మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా నేతలు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్