Rahul Gandhi: కేంబ్రిడ్జిలో డిఫరెంట్ లుక్తో రాహుల్.. ఫొటోలు వైరల్
భారత్ జోడో యాత్ర నుంచి కొన్ని నెలలుగా గడ్డం పెంచిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్తో ఆకట్టుకుంటున్నారు. లండన్ పర్యటనలో సూట్తో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
దిల్లీ: నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్ జోడో యాత్ర(Bharat jodo yatra)లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్(Newk look)తో ఆకట్టుకుంటున్నారు. హెయిర్ కటింగ్, గడ్డం ట్రిమ్ చేయించుకొని తొలిసారి స్టైలీష్ లుక్లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్ అక్కడ సూట్తో డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్పూర్లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు.
52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ‘‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ’’ అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్గా ‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ’’ అనే అంశంపై ప్రసంగిస్తారు’’ అని పేర్కొంటూ నిన్న ట్వీట్ చేసింది. మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్ క్రిస్టీ కళాశాల డైరెక్టర్, ట్యూటర్, గ్లోబల్ హ్యుమానిటీస్ ఇనిషియేటివ్ కో డైరెక్టర్ అయిన శ్రుతి కపిలతో రాహుల్ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు.
భాజపా పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్లో ప్రారంభించిన రాహుల్ జనవరి 30న ముగించిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 12 రాష్ట్రాల మీదుగా దాదాపు 4వేల కి.మీలకు పైగా పాదయాత్ర చేశారు. అలాగే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనూ ఇటీవల ప్రసంగించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.