Rahul Gandhi: ప్రభుత్వ ఒత్తిడితోనే నా ఫాలోవర్లను తగ్గిస్తున్నారు.. ట్విటర్ సీఈవోకు రాహుల్ లేఖ
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ (Twitter)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి తన ట్విటర్లో
తోసిపుచ్చిన సామాజిక మాధ్యమ సంస్థ
దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ (Twitter)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ట్విటర్లో కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్ తెలియకుండా భాగస్వామి అవుతోందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది.
నిజానికి రాహుల్ గతేడాది డిసెంబరు 27నే ఈ లేఖ రాయగా.. తాజాగా అది వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ల ట్విటర్ ఖాతాలను తన ఖాతాతో సరిపోల్చుతూ రాహుల్ లేఖలో పలు విమర్శలు చేశారు. 2021లో తొలి ఏడు నెలల్లో తనకు ఫాలోవర్లు పెరిగారని, ఆ తర్వాత ఆగస్టులో వారం పాటు తన ఖాతాను బ్లాక్ చేసినప్పటి నుంచి కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు.
రాహుల్ లేఖ ఇలా..
‘‘డియర్ పరాగ్, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, అధికారం మధ్య సిద్ధాంతపరమైన యుద్ధానికి సామాజిక మాధ్యమాలే వేదికవుతున్నాయి. అందువల్ల ఈ వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, భారత్లో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందన్న విషయాన్ని మీ (ట్విటర్ సీఈవోను ఉద్దేశిస్తూ) దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా..! దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా.. అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే, భారత్లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి.. ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విటర్ వంటి మాధ్యమాలు మాకు ప్రధాన వేదికలుగా మారాయి. అయితే గత కొన్ని రోజులుగా నా ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోంది.
ట్విటర్లో నాకు దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సగటున రోజుకు 8 నుంచి 10వేల మంది కొత్త ఫాలోవర్లు వస్తుంటారు. 2021 మే నెలలో దాదాపు 6.4లక్షల మంది కొత్తగా నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. గతేడాది జులై వరకు ఇది ఇలాగే కొనసాగింది. ఆగస్టు 2021లో ఒక్కసారిగా ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. నా ఖాతాకు సగటు నెలవారీ కొత్త ఫాలోవర్ల సంఖ్య దాదాపు సున్నాకు తగ్గింది. గతేడాది ఆగస్టులో వారం రోజుల పాటు నా ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత నుంచి కొత్త ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, యాదృచ్ఛికంగా అదే సమయంలో దిల్లీలో అత్యాచార ఘటన, సాగు చట్టాలతో పాటు అనేక అంశాలపై నేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాను.
నా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విటర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండానే నా ఖాతాను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. నేను ట్వీట్ చేసిన ఫొటోలను ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలతో పాటు మరికొందరు కూడా ట్వీట్ చేశారు. అయినా, వాటిని మాత్రం బ్లాక్ చేయకుండా నన్ను టార్గెట్ చేశారు. అందువల్ల కోట్లాది మంది భారతీయుల తరఫున నేను చెబుతున్నది ఒక్కటే..! దేశాన్ని విధ్వంసం చేయాలనుకునేవారి చేతుల్లో ట్విటర్ పావులా మారకూడదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
నకిలీలను సహించబోం: ట్విటర్
ఈ లేఖపై ట్విటర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ట్విటర్లో ఫాలోవర్ల సంఖ్య అందరికీ కన్పించేదే. అది అర్థవంతమైన, కచ్చితమైన సంఖ్య అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికీ కలిగించాలనేదే మా ఉద్దేశం. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని మా వేదిక ఎన్నటికీ అంగీకరించబోదు. అలాంటి వాటి పట్ల మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చు. మా విధానాలను ఉల్లంఘించినందుకు గానూ ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటాం’’ అని ట్విటర్ వివరణ ఇచ్చింది.
గతేడాది ఆగస్టులో దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో వారితో దిగిన ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గానూ.. ఆయన ట్విటర్ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం