Rahul Gandhi: ప్రభుత్వ ఒత్తిడితోనే నా ఫాలోవర్లను తగ్గిస్తున్నారు.. ట్విటర్ సీఈవోకు రాహుల్ లేఖ
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ (Twitter)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి తన ట్విటర్లో
తోసిపుచ్చిన సామాజిక మాధ్యమ సంస్థ
దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ (Twitter)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ట్విటర్లో కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్ తెలియకుండా భాగస్వామి అవుతోందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది.
నిజానికి రాహుల్ గతేడాది డిసెంబరు 27నే ఈ లేఖ రాయగా.. తాజాగా అది వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ల ట్విటర్ ఖాతాలను తన ఖాతాతో సరిపోల్చుతూ రాహుల్ లేఖలో పలు విమర్శలు చేశారు. 2021లో తొలి ఏడు నెలల్లో తనకు ఫాలోవర్లు పెరిగారని, ఆ తర్వాత ఆగస్టులో వారం పాటు తన ఖాతాను బ్లాక్ చేసినప్పటి నుంచి కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు.
రాహుల్ లేఖ ఇలా..
‘‘డియర్ పరాగ్, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, అధికారం మధ్య సిద్ధాంతపరమైన యుద్ధానికి సామాజిక మాధ్యమాలే వేదికవుతున్నాయి. అందువల్ల ఈ వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, భారత్లో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందన్న విషయాన్ని మీ (ట్విటర్ సీఈవోను ఉద్దేశిస్తూ) దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా..! దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా.. అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే, భారత్లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి.. ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విటర్ వంటి మాధ్యమాలు మాకు ప్రధాన వేదికలుగా మారాయి. అయితే గత కొన్ని రోజులుగా నా ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోంది.
ట్విటర్లో నాకు దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సగటున రోజుకు 8 నుంచి 10వేల మంది కొత్త ఫాలోవర్లు వస్తుంటారు. 2021 మే నెలలో దాదాపు 6.4లక్షల మంది కొత్తగా నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. గతేడాది జులై వరకు ఇది ఇలాగే కొనసాగింది. ఆగస్టు 2021లో ఒక్కసారిగా ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. నా ఖాతాకు సగటు నెలవారీ కొత్త ఫాలోవర్ల సంఖ్య దాదాపు సున్నాకు తగ్గింది. గతేడాది ఆగస్టులో వారం రోజుల పాటు నా ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత నుంచి కొత్త ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, యాదృచ్ఛికంగా అదే సమయంలో దిల్లీలో అత్యాచార ఘటన, సాగు చట్టాలతో పాటు అనేక అంశాలపై నేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాను.
నా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విటర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండానే నా ఖాతాను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. నేను ట్వీట్ చేసిన ఫొటోలను ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలతో పాటు మరికొందరు కూడా ట్వీట్ చేశారు. అయినా, వాటిని మాత్రం బ్లాక్ చేయకుండా నన్ను టార్గెట్ చేశారు. అందువల్ల కోట్లాది మంది భారతీయుల తరఫున నేను చెబుతున్నది ఒక్కటే..! దేశాన్ని విధ్వంసం చేయాలనుకునేవారి చేతుల్లో ట్విటర్ పావులా మారకూడదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.
నకిలీలను సహించబోం: ట్విటర్
ఈ లేఖపై ట్విటర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ట్విటర్లో ఫాలోవర్ల సంఖ్య అందరికీ కన్పించేదే. అది అర్థవంతమైన, కచ్చితమైన సంఖ్య అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికీ కలిగించాలనేదే మా ఉద్దేశం. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని మా వేదిక ఎన్నటికీ అంగీకరించబోదు. అలాంటి వాటి పట్ల మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చు. మా విధానాలను ఉల్లంఘించినందుకు గానూ ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటాం’’ అని ట్విటర్ వివరణ ఇచ్చింది.
గతేడాది ఆగస్టులో దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో వారితో దిగిన ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గానూ.. ఆయన ట్విటర్ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?