Railway Board: 1.78 కోట్ల మందికి ఫైన్.. ₹1000 కోట్లు వసూలు
తొమ్మిది నెలల కాలంలో 1.78 కోట్ల మంది వద్ద జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది......
దిల్లీ: తొమ్మిది నెలల కాలంలో 1.78 కోట్ల మంది ప్రయాణికుల నుంచి జరిమానాలు వసూలు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 2021-22 మొదటి తొమ్మిది నెలల్లో.. టికెట్లు లేకుండా, అదనపు లగేజీకి రుసుము చెల్లించకుండా ప్రయాణించిన వారివద్ద నుంచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐలో దాఖలు చేసిన ప్రశ్నకు రైల్వే బోర్డు స్పందించింది. ఇందుకు సంబంధించిన డేటాను అందుబాటులోకి తెచ్చింది.
2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ప్రయాణ, ఫ్లాట్ఫామ్, లగేజీ టికెట్ లేకుండా ఉన్న 1.78 కోట్ల మందిని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో ₹1,017.48కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ వసూళ్లు 2019-2020 కంటే 79 శాతం అధికమని వివరించింది. కొవిడ్ నిబంధనల ఎత్తివేతతో పెరిగిన ప్రయాణాలు, ఆన్లైన్ బుకింగ్తో చాలా మంది బుక్ చేసుకోకుండానే రైలు ఎక్కడం భారీ జరిమానాలకు కారణమని ఓ అధికారి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..