Quality Life: ఆ రాష్ట్రాల్లో వృద్ధులు హాయిగా ఉన్నారు..!

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో వృద్ధులు నాణ్యమైన జీవితం గడుపుతున్నారని తేలింది.

Published : 12 Aug 2021 22:01 IST

దిల్లీ: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో వృద్ధులు నాణ్యమైన జీవితం గడుపుతున్నారని తేలింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌నెస్‌ అనే సంస్థ నివేదికను వెల్లడించింది. ఈ అంశంలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది.  50 లక్షలకుపైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాలను ఏజ్డ్‌ విభాగం, అంతకన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలను రిలేటివ్‌ రీ ఏజ్డ్‌  విభాగంగా వర్గీకరించారు. ఏజ్డ్‌ కేటగిరీలో 2,3 స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్‌ నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. రిలేటివ్‌ రీ ఏజ్డ్‌ జాబితాలో హిమాచల్‌ప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక, సామాజిక స్థితులు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని