IAF: ఇక.. రోడ్డుపైనా యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్
అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమనాలు హైవేలపై ల్యాండ్ అయ్యేందుకు వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్ను కేంద్ర రక్షణమంత్రి
తొలి స్ట్రెచ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ
బర్మేర్: అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమనాలు హైవేలపై ల్యాండ్ అయ్యేందుకు వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్ను కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. బర్మేర్ జిల్లాలోని 925 నంబరు జాతీయ రహదారిపై ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రెచ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాయుసేన నిర్వహించిన డ్రిల్లో తొలుత హెర్క్యూలెస్ సి-130జే యుద్ధవిమానం జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది.
ఈ విమానంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్, గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి ఆర్కేఎస్ బదౌరియా ప్రయాణించారు. కేంద్రమంత్రులు ప్రయాణించిన విమానం తర్వాత సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్ జెట్, ఏఎన్-32 మిలిటరీ రవాణా విమానం, ఎంఐ-17 వంటి హెలికాప్టర్లు కూడా ఈ హైవేపై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగాయి.
దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ స్ట్రెచ్ను ఏర్పాటు చేశారు. సాధారణంగా యుద్ధ పరిస్థితులు శత్రువులు ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నప్పుడు యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఇలా హైవేలపై ల్యాండింగ్ స్ట్రెచ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి 28 హైవేలను గుర్తించారు. తొలి ప్రయత్నంగా బర్మేర్లోని 925వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. మొత్తం 19 నెలలు శ్రమించి దీన్ని నిర్మించారు. 2017లో లఖ్నవూ-ఆగ్రా ఎక్స్ప్రెస్వే పైనా వాయుసేన ఇలాంటి మాక్ ల్యాండింగ్ డ్రిల్ చేపట్టింది. అయితే, హైవేపై ల్యాండింగ్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘సాధారణంగా హైవేలపై ట్రక్కులు, కార్లు చూస్తుంటాం. ఇప్పుడు అక్కడ విమానాలు కూడా దిగుతున్నాయి. ఇందుకోసం కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. భారత్ తమ దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పేందుకు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్లే నిదర్శనం. కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?