ఖడ్గాలు చేతపట్టి రాజ్‌పుత్ మహిళల సంప్రదాయ నృత్యం

గుజరాత్‌లో ఖడ్గాలు చేతపట్టి.. 200 మంది రాజ్‌పుత్ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంటోంది.

Published : 21 Oct 2021 14:23 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో ఖడ్గాలు చేతపట్టి 200 మంది రాజ్‌పుత్ మహిళలు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంటోంది. "తల్వార్ రాస్" పేరుతో మహిళల వీరత్వాన్ని ప్రదర్శించేలా రాజ్‌కోట్‌కు చెందిన రాజ కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏటా ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకొంటామని రాజకుటుంబీకులు చెబుతున్నారు. గతంలో ఏకంగా 2 వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు ఖడ్గాలతో నృత్యం చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించేందుకే ‘తల్వార్‌ రాస్‌’లో  పాల్గొంటున్నామని వారు చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని