రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపేశాం 

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు రామజన్మభూమి.....

Updated : 07 Mar 2021 13:09 IST

ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడి

దిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆలయం ముందు మరికొంత స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

రామ మందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ట్రస్టు వీహెచ్‌పీని కోరింది. దీంతో దేశ వ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత మొత్తాన్ని అయోధ్య రాముడి మందిరం నిర్మాణం కోసం విరాళాలుగా అందజేశారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని