వ్యాక్సిన్ కంటే వైరస్ వల్లే ప్రమాదం ఎక్కువ!
వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకట్టడంతో పోలిస్తే కొవిడ్-19 వైరస్ కలిగించే నష్టమే ఎక్కువని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి
లండన్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరిలో రక్తం గడ్డ కడుతున్నట్లు పలుదేశాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఇలాంటి సంఘటనలతో పోలిస్తే కొవిడ్-19 వైరస్ కలిగించే నష్టమే ఎక్కువని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రక్తం గడ్డకట్టడంపై వస్తోన్న ఫిర్యాదులపై బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధన చేశారు. కరోనా సోకడం వల్ల, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టిన (సెరెబ్రల్ వెనస్ థ్రోంబోసిస్-సీవీటీ) కేసులను విశ్లేషించారు. సాధారణ ప్రజల్లో ఇన్ఫ్ల్యూయెంజా వల్ల కలిగే సీవీటీ కేసులను వీటితో పోల్చి చూశారు. దీంతో కరోనా సోకిన కొందరిలో రక్తం గడ్డకట్టడం (సీవీటీ) సాధారణమనే అభిప్రాయానికి వచ్చారు. వ్యాక్సిన్లతో పోల్చితే కొవిడ్-19 వల్ల కలిగే ప్రమాదం 8 నుంచి 10 రెట్లు ఎక్కువని స్పష్టం చేశారు.
‘కరోనా వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ర్పభావాలపై పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ కంటే వైరస్ వల్లే దుష్ర్పభావాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ట్రాన్స్లేషనల్ న్యూరోబయోలజీ విభాగాధిపతి పాల్ హ్యారిసన్ పేర్కొన్నారు. అంతేకాక 30 ఏళ్లలోపు వారిలోనూ వైరస్ వల్ల సీవీటీ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదాలు 30 శాతం ఉన్నట్లు పరిశోధనలో గుర్తించామని చెప్పారు. అందుచేత వ్యాక్సిన్తో కలిగే నష్టాల కంటే ప్రయోజనాలే ఎక్కువని తెలిపారు.
వ్యాక్సిన్, కొవిడ్-19.. ఈ రెండింటి కారణంగా రక్తం గడ్డకట్టే సమస్యలు ఒకేలా ఉన్నాయా? లేదా భిన్నంగా ఉన్నాయా? అనే కోణంలో మరికొన్ని అధ్యయనాలు చేపట్టాల్సి ఉందని పాల్ హ్యారిసన్ అభిప్రాయపడ్డారు. రక్తం గడ్డ కట్టడాన్ని తెలుసుకునేందుకు చేసే వైద్య పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని.. లేకపోతే ఒక్కోసారి తప్పుడు కోడింగ్ వల్ల సీవీటీ ఫలితాల కచ్చితత్వంపై ప్రభావం పడుతుందని సూచించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనెకా, అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్నట్లు పలు దేశాల్లో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ టీకాల పంపిణీని ఆయా దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్