భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ: త్వరలోనే ఆర్‌బీఐ ప్రకటన

డిజిటల్‌ కరెన్సీ సంబంధించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆర్బీఐ వెల్లడించింది.

Published : 05 Feb 2021 21:34 IST

ముంబయి: దేశంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టే విషయమై, అందుకు సంబంధించిన విధివిధానాలను గురించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ రూపంలో కరెన్సీని అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని, అవకాశాలను ఆర్‌బీఐ అంతర్గత కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని డిప్యూటీ గవర్నర్‌ బి.పి. కనుంగో వెల్లడించారు. ఈ విషయమై తమ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు.

బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ విధానాల వినియోగం అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో కూడా అధికారిక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఆర్‌బీఐ గతంలో ప్రకటించింది. ఇటీవలి కాలంలో ప్రైవేటు డిజిటల్‌ కరెన్సీలు, వర్చువల్‌ కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలకు దేశంలో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. అయితే వీటివల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని .. ప్రభుత్వం, ద్రవ్య నియంత్రణ సంస్థలు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇక ప్రైవేటు క్రిప్టోకరెన్సీ చలామణీని కేంద్ర ప్రభుత్వం గతవారం నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన కీలకం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని