‘ఎంతటి దుస్సాహసాన్నైనా అడ్డుకుంటాం’

సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు..............

Updated : 29 Sep 2020 19:05 IST

భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా

దిల్లీ: సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పరోక్షంగా దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.  

రఫేల్‌ యుద్ధ విమానాలు సహా, సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, చినూక్‌, అపాచీ హెలికాప్టర్ల చేరికతో ఐఏఎఫ్‌ వ్యూహాత్మక సామర్థ్యం మరింత మెరుగైందన్నారు. భవిష్యత్తుల్లో జరిగే సైనిక ఘర్షణల్లో విజయం సాధించాలంటే వైమానిక శక్తి కీలకం అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సాంకేతికతను అందిపుచ్చుకొని నిర్వహించడం అత్యంత ముఖ్యం అన్నారు.  రెండు స్క్వాడ్రన్ల లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌లను చేర్చడం, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధాల్ని తక్కువ సమయంలో సుఖోయ్‌-30 ఎంకేఐకి అనుసంధానించడం వంటి చర్యలు మెరుగవుతున్న దేశీయ సామర్థ్యానికి అద్దం పడుతున్నాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని