PFI: పీఎఫ్ఐపై నిషేధం.. కారణాలివే..!
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టింది. వారం వ్యవధిలో రెండు సార్లు జరిపిన ఈ సోదాల్లో 250 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులు, కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి రావడంతో కేంద్రం ఈ సంస్థపై చర్యలు తీసుకుంది. మరి పీఎఫ్ఐపై నిషేధం విధించడానికి కారణాలేంటీ? ఎన్ఐఏ సోదాల్లో తెలిసిందేంటీ? వంటి వివరాలను కేంద్ర హోంశాఖ వర్గాలు, నిఘా వర్గాలు వెల్లడించాయి.
* పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక అతివాద సంస్థల్లో ఒకటి. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. హింస, నేరాలు, ఉగ్రవాదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పీఎఫ్ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారు. రెండు వర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణ ఇస్తోంది.
* పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300లకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. యూఏపీఏ, పేలుడుపదార్థాలు, ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు.
* పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబందాలున్నాయని అనేకసార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కేరళలో కొంతమంది పీఎఫ్ఐ కార్యకర్తలు ఆ మధ్య ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా, ఇరాక్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఐసిస్తో కలిసి పనిచేస్తోన్న కొంతమంది కార్యకర్తలను ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్టు కూడా చేశారు. ఇక, పీఎఫ్ఐకి జమాత్ ఉల్ ముజాహిదీన్తోనూ సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి.
* 2021లో కేరళలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అంతకుముందు 2019లో తమిళనాడులో హిందూ నేత వి. రామలింగం కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుల్లో పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరేగాక, గతంలోనూ కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న పీఎఫ్ఐ సభ్యుల నుంచి అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ శిక్షణ వీడియోలు అప్పట్లో లభ్యమయ్యాయి.
* 2021 జూన్లో కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, జిహాదీ సాహిత్యాన్ని పోలీసులు గుర్తించారు. ఈ అటవీ ప్రాంతాన్ని పీఎఫ్ఐ మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోంది.
* 2013 ఏప్రిల్లో కేరళలోని కన్నూర్ జిల్లాలో గల పీఎఫ్ఐ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అప్పట్లో దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టగా 41 మంది పీఎఫ్ఐ సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది. యువతకు నైపుణ్యాల శిక్షణ ముసుగులో పీఎఫ్ఐ.. మిలిటరీ తరహా శిక్షణ ఇస్తోందన్న ఆరోపణలున్నాయి. ఓ వర్గానికి వ్యతిరేకంగా యువతలో ద్వేషభావాన్ని నింపుతూ దాడులకు శిక్షణ ఇస్తోందని దర్యాప్తులో తేలింది.
* సామాజిక సంస్థగా చెప్పుకొనే పీఎఫ్ఐ.. ఈ ఏడాది కర్ణాటకలోని ప్రముఖ హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును అతి దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్టయిన వారంతా పీఎఫ్ఐ కార్యకర్తలే.
* పీఎఫ్ఐ తన కార్యకలాపాల కోసం దేశ విదేశాల నుంచి నిధులు అందుకుంటోంది. ఇవన్నీ అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల నుంచి వస్తున్నవే. పీఎఫ్ఐకు చెందిన 100కు పైగా బ్యాంకు ఖాతాలు.. ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోలట్లేదని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. అందువల్ల, ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద పీఎఫ్ఐ రిజిస్ట్రేషన్ హోదాను కేంద్రం ఉపసంహరించింది.
* ఇటీవల ఎన్ఐఏ జరిపిన సోదాల్లోనూ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ సంస్థ సభ్యుల ఇళ్లల్లో బాంబు తయారీ పత్రాలు, ఐసిస్ వీడియోలను అధికారులు గుర్తించారు. భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM