భారత్లో తీవ్ర సంక్షోభానికి కారణాలివే..! WHO
కరోనా బాధితులు అనవసరంగా ఆసుపత్రులకు పరుగుతీయడమే భారత్లో కరోనా సంక్షోభం మరింత తీవ్రమవడానికి కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది.
మరింత అవగాహన కల్పించాలని సూచన
జెనీవా: కరోనా బాధితులు అనవసరంగా ఆసుపత్రులకు పరుగుతీయడమే భారత్లో కరోనా సంక్షోభం మరింత తీవ్రమవడానికి ఒక కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ప్రజలు సమూహాలుగా ఏర్పడడం, కొత్త రకాల కరోనా వైరస్లు వెలుగుచూడడం, తక్కువ మందికే వ్యాక్సిన్ అందడం వంటి అంశాలు భారత్లో కరోనా వైరస్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని వెల్లడించింది.
కరోనా వైరస్ బారినపడుతున్న వారిలో కేవలం 15శాతం కంటే తక్కువ బాధితులకే ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి తారిక్ జసారెవిక్ పేర్కొన్నారు. వీరిలో కొందరికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుందని అభిప్రాయపడ్డారు. కానీ, ప్రస్తుతం చాలా మంది రోగులు ఆసుపత్రులకు పరుగులు తీయడమే సమస్యకు మరో కారణమవుతోందని (సరైన సమాచారం, సలహా అందకపోవడంతో..) డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి వెల్లడించారు. ఇంటి వద్దే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ పంపిణీ తక్కువగా ఉన్న సమయంలో వ్యక్తిగత రక్షణ చర్యలపట్ల అలసత్వం వహించడం, సామూహిక సమావేశాలు, అత్యంత వ్యాప్తి కలిగిన వేరియంట్ వ్యాప్తి ఉన్న ప్రతి దేశంలో వైరస్ తుపానులా విజృంభిస్తుందనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ చెబుతూనే ఉందని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి సమయంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, బాధితులకు చికిత్స గురించి వివరించడం, ఇంటి వద్దే చికిత్స తీసుకునేలా వారికి తెలియజెప్పడం, ప్రకటనలు, ప్రచార వేదికల ద్వారా సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి సూచించారు. అయితే, ప్రస్తుతం భారత్కు అవసరమైన కీలక వైద్య సామగ్రిని సరఫరా చేస్తున్నామని వీటితోపాటు 4వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా పంపించామని పేర్కొన్నారు.
ఇక భారత్లో ప్రస్తుత పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెడ్రెయేసస్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తోందని.. ఇందులో భాగంగా వైద్య సామగ్రి, వేలాదిగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, లేబొరేటరీ పరికరాలు అందిస్తోందన్నారు. అంతేకాకుండా భారత్కు సిబ్బంది సహకారం అందించేందుకు డబ్ల్యూహెచ్వో ఇప్పటికే ముందడుగు వేసినట్లు టెడ్రోస్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా మరణాల సంఖ్య 2లక్షలకు చేరువయ్యింది. ఇలాంటి సమయంలో పలు ఆసుపత్రులు కొవిడ్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ బాధితులకు పడకల కొరత ఏర్పడడంతో పాటు ఆక్సిజన్ లభ్యంకాక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)