Covid Wave: కరోనా కేసుల పెరుగుదల.. మరో వేవ్కు సంకేతమా..?
ఒమిక్రాన్ ఉపరకాలు వెలుగు చూస్తున్నాయని నివేదికలు వస్తోన్న వేళ పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
నిపుణులు ఏం చెబుతున్నారంటే
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతోందని భావిస్తోన్న తరుణంలో రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. మొన్నటివరకు నిత్యం వెయ్యికి దిగువన నమోదైన కేసుల సంఖ్య ప్రస్తుతం 2వేలు దాటింది. ఒమిక్రాన్ ఉపరకాలు వెలుగు చూస్తున్నాయని నివేదికలు వస్తోన్న వేళ పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ విజృంభణ మరో వేవ్కు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడం మరో వేవ్కు (Fourth Wave) దారితీయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవేవ్ వచ్చినా ప్రభావం తక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
నాలుగో వేవ్ తీవ్రత తక్కువే..
ప్రస్తుతం కొవిడ్ కేసుల్లో పెరుగుదల చూస్తుంటే నాలుగో వేవ్ వచ్చే సంభావ్యత తక్కువేనని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశంలో కరోనా విజృంభణపై ముందస్తు అంచనాలు వేస్తోన్న ఆయన.. ఆంక్షల తొలగింపు వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అన్నారు. ‘రెండో వేవ్లో ఎక్కువ సంఖ్యలో వైరస్ బారినపడడంతోపాటు దేశంలో కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా పంపిణి జరిగింది. దీంతో కొత్త వేరియంట్ల వ్యాప్తికి అంతగా ఆస్కారం ఉండకపోవచ్చు. వైరస్ వ్యాప్తిని మరింత పరిశీలించిన తర్వాతే ఓ అంచనాకు రావాలి. చాలా దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగినప్పటికీ వెంటనే తగ్గుముఖం పట్టాయి’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. వేవ్ విషయం పక్కనబెడితే వైరస్ వ్యాప్తి నివారణపై ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ప్రజలు, ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఇప్పుడే అంచనా వేయలేం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే మరో వేవ్కు ఇవి కారణం కాకపోవచ్చని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ జేపీ ములియిల్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నమోదవుతోన్న కేసులు ఒకశాతం (పాజిటివిటీ రేటు) కంటే తక్కువే. వీటిని ఆధారంగా చేసుకొని కొత్త వేవ్పై అంచనాలు వేయలేం. మూడోవేవ్ సమయంలోనూ విద్యార్థులు కరోనా బారినపడడం, ఆస్పత్రి చేరికలు పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం చూస్తోన్న ఈ స్వల్ప పెరుగుదల కొత్త వేరియంట్ వల్ల కాదు. కేవలం ఒమిక్రాన్ కారణంగానే కేసులు పెరుగుతున్నాయ్’ అని డాక్టర్ ములియిల్ వెల్లడించారు.
రాష్ట్రాలు అలెర్ట్..
గడిచిన వారం రోజులుగా దేశంలో పలుచోట్ల కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దిల్లీ, యూపీ, కేరళ, గుజరాత్, హరియాణాతోపాటు మిజోరం రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశరాజధాని దిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గడిచిన 15రోజులుగా వైరస్ వ్యాప్తిలో 500శాతం పెరుగుదల కనిపించినట్లు ఓ సర్వే పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 2వేలు దాటింది. పాజిటివిటీ రేటు 0.31శాతం నుంచి 0.83శాతానికి పెరగగా.. దిల్లీలో మాత్రం 5శాతం దాటింది. ఇలా దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరగడంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ.. ఇప్పటికే నిపుణులతో సమీక్ష నిర్వహించింది. కొవిడ్ వేరియంట్లపై అన్ని రాష్ట్రాలు పర్యవేక్షణ చేయాలని సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
కేసుల పెరుగుదలకు కారణం అదే..?
దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలకు కచ్చితమైన కారణాలు లేనప్పటికీ మాస్కులు ధరించడం వంటి కొవిడ్ ఆంక్షలు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. విద్యా సంస్థలతోపాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడమూ ఇందుకు మరో కారణంగా పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని భావిస్తోన్న సమయంలో మరోసారి కొవిడ్ ఆంక్షలకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు