మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత ఉంది : రాష్ట్రపతి

దిల్లీ: బైపాస్‌ సర్జరీ తర్వాత తాను బాగానే కోలుకుంటున్నానని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతభావం ఉందని భావోద్వేగంగా..

Published : 01 Apr 2021 16:43 IST

దిల్లీ: బైపాస్‌ సర్జరీ తర్వాత తాను బాగానే కోలుకుంటున్నానని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతభావం ఉందని భావోద్వేగంగా స్పందించారు. ఆస్పత్రిలో సేవలందించిన వైద్యులు, సంరక్షకుల అంకితభావానికి ధన్యవాదాలు తెలిపారు.  

కాగా, ఛాతీలో అసౌకర్యం కారణంగా గత నెల 26న ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీ ఎయిమ్స్‌కు సిఫార్సు చేశారు. అనంతరం మంగళవారం దిల్లీ ఎయిమ్స్‌లో రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఆకాంక్షించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని