‘మూడ్రోజుల్లో ఆ వీడియో తీయకుంటే’.. సన్నీ లియోన్కు మంత్రి వార్నింగ్!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నటించిన ఓ వీడియో వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ వీడియో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భోపాల్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నటించిన ఓ వీడియో వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ వీడియో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియో మూడ్రోజుల్లో తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సన్నీ లియోన్తో పాటు ఆ పాట ఆలపించిన గాయకులను హెచ్చరించారు.
‘మధుబన్ మే రాధిక నాచే’ పేరిట హిందీలో ఓ వీడియో సాంగ్ విడుదలైంది. షరీబ్, తోషి ఈ పాటను ఆలపించారు. సన్నీ లియోన్ నర్తించారు. 1960లో వచ్చిన ‘కోహినూర్’ చిత్రంలోని ‘మధుబన్ మే రాధిక నాచే రే’ అనే పాటలోని పల్లవిని ఈ పాట పోలి ఉంటుంది. పాత పాటను మహ్మద్ రఫీ ఆలపించగా.. దిలీప్ కుమార్ నటించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న కొత్త పాటను విడుదల చేశారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన కొందరు అర్చకులు ఈ పాటపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
తాజాగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా స్పందించారు. కొందరు కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘మధుబన్ మే రాధిక’ కూడా ఆ కోవకు చెందినదేనని, ఈ వ్యవహారంలో సన్నీ లియోన్, షరీబ్, తోషి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడ్రోజుల్లోగా వీడియో తొలగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో మంగళ సూత్రాన్ని ఉద్దేశిస్తూ ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ప్రకటనపైనా నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ ప్రకటనను ఆ సంస్థ ఉపసంహరించుకుంది. డాబర్ రూపొందించిన మరో యాడ్ సైతం ఇలాంటి హెచ్చరికలే ఎదుర్కొంది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
లిరిక్స్ మారుస్తాం
మధ్యప్రదేశ్ హోంమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఆ పాటను విడుదల చేసిన మ్యూజిక్ కంపెనీ ‘సరిగమప’ లిరిక్స్ మార్చాలని నిర్ణయించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మార్పు చేసిన లిరిక్స్తో పాటు, పాట పేరును కూడా మారుస్తామని పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో అన్ని వేదికల్లోనూ మార్పు చేసిన లిరిక్స్ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్