వైరల్‌గా మారిన జల ప్రళయం వీడియోలు

ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరద ధాటికి కార్మికులు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి....

Published : 10 Feb 2021 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరద ధాటికి కార్మికులు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఫిబ్రవరి 7న జోషిమఠ్‌ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలోని తపోవన్‌ జల విద్యుత్కేంద్రంలోకి వరద పోటెత్తింది. బురదతో కూడిన వరద ఉద్ధృతికి ఆ విద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. ఆ సమయంలో అందులో పనిచేస్తున్న కార్మికులు సైతం ఆ వరదలో కొట్టుకుపోయారు. కాగా ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతిచెందారు. ఇంకా 170 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు భారత సైన్యం, ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) రాత్రింబవళ్లు తీవ్రంగా  కృషిచేస్తున్నాయి. ఓ టన్నెల్‌లో 25-35 మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్న సహాయక బృందాలు టన్నెల్‌కు డ్రిల్లింగ్‌ చేసి బాధితులకు ఆక్సిజన్‌ ‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి...

ఆ పరికరంపైనే ‘అణు’మానాలు

జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు