Covid 19: అందుకే.. కొవిడ్ తర్వాత వేగంగా వ్యాధుల ముసురు..!
కొవిడ్ సోకితే రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక కణాల సామర్థ్యాన్ని కుంటుబరుస్తోందని.. ఫలితంగా అనుబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు
దెబ్బతింటోన్న రోగనిరోధక శక్తి..!
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ సోకితే రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక కణాల సామర్థ్యాన్ని ఇది బలహీనపరుస్తోందని.. ఫలితంగా అనుబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అవి స్పందించే తీరులో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. మ్యూనిచ్లోని లూడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. విశ్వవిద్యాలయ బయోమెడికల్ సెంటర్లోని ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ అన్నె క్రూగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. వైరస్ కారణంగా రోగనిరోధక శక్తిపై పడుతున్న అదృశ్య దుష్ప్రభావాలను కనుక్కోవడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన ఫలితాలను పీఎల్వోఎస్ పాథోజెన్స్ జర్నల్లో ప్రచురించారు.
పరిశోధన ఫలితాలు ఇలా..
సార్స్ కోవ్-2 సోకిన వారిలో 3 నుంచి 10 శాతం రోగులకు మధ్య స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో వైరస్పై రోగనిరోధక శక్తి తీవ్రంగా స్పందిస్తోంది. ఇది శరీరంలోని కీలక వ్యవస్థల్లో వాపును పుట్టిస్తోంది. నరాల లోపల రక్తం గడ్డలు కట్టేందుకు కారణం అవుతోంది. ఫలితంగా ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపిస్తోన్నట్లు గుర్తించారు.
సార్స్ కోవ్-2 వైరస్ సోకిన తర్వాత శరీరంలోని రోగనిరోధక శక్తిలోని డెన్డ్రిటిక్ అనే కణాల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పనిచేయదు. దీని ఫలితంగా సదరు రోగి వైరస్ నుంచి కోలుకొన్నా.. సెకండరీ ఇన్ఫెక్షన్ల(అనుబంధ ఆరోగ్య సమస్య) బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరిగిపోతోంది.
ఏమిటీ డెన్డ్రిటిక్ కణాలు..?
డెన్డ్రిటిక్ కణాలు వ్యాధినిరోధక వ్యవస్థలో చాలా కీలకమైనవి. శరీరంలో ప్రవేశించే క్రిములకు వ్యతిరేకంగా వ్యాధినిరోధక స్పందనను ఇవే ప్రేరేపిస్తాయి. సహాయ టి కణాలను సచేతనం చేస్తాయి. ఇవి బి సెల్స్ యాంటీబాడీస్ను స్రవించి వైరస్ను చంపేలా చూస్తాయి.
ప్రొఫెసర్ క్రూగ్ బృందం మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులపై పరిశోధనలు చేసింది. మొత్తం 65 మంది రక్త నమూనాలు సేకరించి వాటిని విశ్లేషించింది. వీరి రక్తంలో డెన్డ్రిటిక్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, డెన్డ్రిటిక్ కణాలకు టి సెల్స్ను సచేతనం చేసే సామర్థ్యం కూడా తగ్గిన విషయాన్ని గమనించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM