The Resistance Front: ఉగ్ర సంస్థగా ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’: కేంద్ర హోంశాఖ ప్రకటన
కశ్మీర్లో కొత్తగా పుట్టుకొచ్చిన హైబ్రీడ్ ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్పై కేంద్రం చర్యలు చేపట్టింది. ఆ సంస్థను నిషేధిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇంటర్నెట్డెస్క్: జమ్ముకశ్మీర్లో లష్కరే తోయిబా డమ్మీ సంస్థగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(టీఆర్ఎఫ్)పై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. టీఆర్ఎఫ్ను నేడు ఉగ్రసంస్థగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలను చేపట్టింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ‘‘లష్కరే పరోక్ష సంస్థ 2019 నుంచి కార్యకలాపాలు చేపట్టిన టీఆర్ఎఫ్(The Resistance Front) ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోంది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం, నియామకాలు, పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతోంది. జమ్ము కశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా టీఆర్ఎఫ్ ప్రభావితం చేస్తోంది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని అమాయక ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యల పథక రచనకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎఫ్ సభ్యులు, అనుబంధ వర్గాలపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ’’ అని ఆ నోటిఫికేషన్లో వెల్లడించింది. పస్బన్-ఈ-అహ్లే-హదీస్ పేరుతో టీఆర్ఎఫ్ను వ్యవహరిస్తుంటారు. ఇక టీఆర్ఎఫ్ కమాండర్ షేక్ సాజిద్ గుల్ను యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. దేశ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రమాదకరంగా పరిణమించాయని కేంద్రం పేర్కొంది.
కశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన తొమ్మిది నెలల తర్వాత ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(టిఆర్ఎఫ్) పేరు బయటకు వచ్చింది. 2020 ఏప్రిల్1వ తేదీన కుప్వారాలోని కెరాన్ ప్రాంతంలో మొదలైన ఎన్కౌంటర్ సందర్భంగా ఈ సంస్థను గుర్తించారు. టీఆర్ఎఫ్ తొలి తరం కేడర్లోని స్థానిక కశ్మీరీలను వాఘా సరిహద్దు మీదుగా పాక్కు రప్పించి అక్కడ శిక్షణ ఇచ్చింది. మరికొందరు యువకులను నియంత్రణ రేఖ నుంచి అక్రమంగా భారత్లోకి పంపింది. గతేడాది ఆగస్టులో టీఆర్ఎఫ్ అగ్రనాయకుడు అబ్బాస్ షేక్ను భారత సైనిక దళాలు కశ్మీర్లో అంతమొందించాయి. స్పోర్ట్స్ వేర్ ధరించిన దళాలు అతడి స్థావరాన్ని చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఇతను గత పదేళ్లుగా వివిధ ఉగ్ర సంస్థల్లో పనిచేశాడు. ఇతర సంస్థల్లో పనిచేసిన పలువురు ఉగ్రవాదులు ఇప్పుడు టీఆర్ఎఫ్లో కనిపిస్తున్నట్లు దళాలు పేర్కొన్నాయి. ఉగ్రదాడి మొత్తాన్ని బాడీ కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి మరికొంత మంది యువకులను ఆకర్షిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం