Omicron : ఒమిక్రాన్ భయం.. ఆంక్షల వలయంలోకి ప్రపంచ దేశాలు..!
కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిగిందనుకునే లోపే తన ఉనికిని మహమ్మారి మరోసారి చాటుకుంది...
కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిగిందనుకునే లోపే తన ఉనికిని మహమ్మారి మరోసారి చాటుకుంది. ఎప్పటిలాగే కొత్తరూపంలో మార్పు చెందుతూ.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ సెకెండ్ వేవ్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అంతకుముందు ఆల్ఫా, బీటా రకాలు వచ్చినా.. డెల్టా పెట్టిన తిప్పలు అవి పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వేరియంట్.. దాదాపు 14 దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.
వారం రోజుల క్రితమే..
ఆల్ఫా పోయింది. డెల్టా డేంజర్ తొలగింది. ఇప్పుడు ఒమిక్రాన్ కథ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన ఈ వేరియంట్ గురించి ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కరోనా గత వేరియంట్లు మిగిల్చిన చేదు అనుభవాల నుంచి అన్ని దేశాలూ ఇంకా తేరుకోలేదు. ఈ లోగా ఒమిక్రాన్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికాలో తొలికేసు నమోదైన రెండు మూడు రోజుల్లోనే ఒమిక్రాన్ బాధిత దేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికమవుతోంది. అవి ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధరణ కాకపోయినా.. బాధితులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
మాస్కు నిబంధనలు మరింత కఠినం
బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయిల్, హాంకాంగ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. ఫలితంగా అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనల్ని కట్టుదిట్టం చేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. జపాన్లోనూ ఒమిక్రాన్ కేసు నమోదైంది. సరిహద్దులు మూసేస్తున్నామని ప్రకటించిన మరుసటి రోజే జపాన్లో తొలికేసు బయటపడింది. నమీబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శాంపిళ్లను పరీక్షించగా.. ఒమిక్రాన్ రకం కేసుగా నిర్ధారణ అయ్యిందని జపాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోనూ ఈ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించక ముందే.. తమ దేశంలోకి ఈ వేరియంట్ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్ వెల్లడించింది. ఈ నెల 24న ఒమిక్రాన్ గురించి డబ్ల్యూహెచ్వోకు దక్షిణాఫ్రికా చెప్పిందని అయితే, తమ దేశంలో ఈ నెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్ను గుర్తించినట్లు నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఒమిక్రాన్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు రెట్లు వేగంగా..!
ఈ వేరియంట్ మూలాలెక్కడ అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నదే చర్చకు వస్తున్న విషయం. ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఒమిక్రాన్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. జీనోమ్ సీక్వెన్స్ చేసి ఈ వేరియంట్ తీవ్రతను గుర్తించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కన్నా ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ప్రభావిత దేశాల్లోని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కూడా పదేపదే హెచ్చరిస్తూనే ఉంది. పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలు అందుబాటులోకి రాగానే వెల్లడిస్తామంటోంది. ఆందోళన చెంది కఠిన ఆంక్షలు విధించడం సరికాదని చెబుతోంది.
స్వల్ప లక్షణాలే..!
రోగ లక్షణాల విషయంలోనూ కొత్త వేరియంట్పై తీవ్ర ఆందోళన నెలకొంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన సమయంలో చాలా మంది బాధితుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. కృత్రిమ ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలుపుకోవాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ఒమిక్రాన్ ఎలాంటి లక్షణాలతో విరుచుకుపడుతుందోనన్న భయం మొదలైంది. దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని వారు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రకటన కాస్తో కూస్తో ఊరటనిస్తున్నా.. పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్నమాటే సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలు వస్తేగానీ, వేరియంట్ ఎలా మ్యుటేట్ అవుతోందన్నది తెలిసేలా లేదు.
భారత్లోనూ మొదలైన ఆందోళన
భారత్లోనూ ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తమవుతోంది. విదేశీ ప్రయాణికుల్ని గుర్తించడం, పరీక్షించడం లాంటి కట్టడి చర్యలు మళ్లీ ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్వేవ్ సమయంలో మహారాష్ట్ర ఎలా వణికిపోయిందో కళ్లారా చూశాం. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఆ రాష్ట్రం జాగ్రత్తపడుతోంది. వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. వారం రోజుల్లో మూడుసార్లు కరోనా పరీక్షలు చేసి నెగెటివ్గా నిర్ధరించుకున్నాకే అనుమతించాలని నిర్ణయించింది. భారత్లో పలువురు వైద్యనిపుణులు ఈ వేరియంట్లో ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేయడం అన్ని రాష్ట్రాలనూ కలవర పెడుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తున్న ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఈ మ్యుటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది.
పరిశోధన సంస్థల అప్రమత్తం
కొవిడ్ కొత్త రకం ఒమిక్రాన్పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలో అనుభవం కలిగిన సీసీఎంబీ మరోసారి కొవిడ్ జీనోం సీక్వెన్సింగ్పై దృష్టి పెట్టింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన కేసుల్లో 5శాతం నమూనాలను వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణకు సీసీఎంబీ, సీడీఎఫ్డీ, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి ల్యాబ్లకు పంపనున్నారు. ఇందులో అత్యధిక నమూనాలు సీసీఎంబీకి చేరుతున్నాయి. గత ఏడాది మే నుంచి సీసీఎంబీలో వైరస్ జన్యుక్రమ పరిశోధనలు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు