Consumer Affairs Ministry: వినియోగదారులు మొబైల్ నెంబర్ చెప్పక్కర్లేదు: కేంద్రం
కొనుగోలు సమయంలో వినియోగదారులు సేవలు పొందేందుకు తమ వ్యక్తిగత వివరాలు అందించడం తప్పనిసరేం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కారణంతో రిటైలర్లు సేవలను నిలిపివేయకూడదని చెప్పింది.
దిల్లీ: వినియోగదారులకు (Consumers) సేవలు అందించేందుకు రిటైలర్లు (Retailers) వారి వ్యక్తిగత వివరాలు అడగవద్దని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ (Consumer affairs Ministry) ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఏదైనా రిటైల్ స్టోర్లో వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లు రూపొందించేందుకు వినియోగదారుడి పేరు, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు అడుగుతుంటారు. వాటిని బహిర్గతం చేసేందుకు కొందరు ఇష్టపడరు.. అలాగని వారికి సేవలు అందించేందుకు నిరాకరించకూడదని రిటైలర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్ తెలిపారు.
వ్యక్తిగత వివరాలు ఇవ్వకపోతే రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్కుమార్ వెల్లడించారు. ‘‘వినియోగదారుల కాంటాక్ట్ నెంబర్లు లేనిదే బిల్లు జనరేట్ చెయ్యడం కుదరడం లేదని విక్రేతలు చెబుతున్నారు. కానీ, ఇది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం సరైన వాణిజ్య విధానం కాదు. అంతేకాకుండా ఆ సమాచారం సేకరించడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’ అని రోహిత్కుమార్ సింగ్ విలేకరులకు తెలిపారు. వినియోగదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ సంస్థలతోపాటు సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), ఎఫ్ఐసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)లకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
బిల్లును రూపొందించడానికి వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను రిటైలర్కు చెప్పడం తప్పనిసరేం కాదు. అయినప్పటికీ లావాదేవీలను పూర్తి చేసేందుకు వినియోగదారులు కచ్చితంగా ఒక నెంబరు చెప్పాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా వారికి మరో మార్గం కనిపించడం లేదు. చాలా మంది వినియోగదారులకు ఈ అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం