Karnataka Polls: కళ్లుచెదిరే రీతిలో.. ఈ కన్నడ నేతల ఆస్తులు..!
కన్నడనాట జరగనున్నట అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బరిలో దిగుతున్న కొందరు నేతల ఆస్తులు భారీ స్థాయిలో ఉన్నాయి. భాజపా నేత ఎంటీబీ నాగరాజు (MTB Nagaraj), కాంగ్రెస్ నేత శివకుమార్లకు (DK Shivakumar) రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి ఆస్తుల వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. అంతేకాకుండా గత ఎన్నికలతో పోలిస్తే వారి ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇలా కన్నడ పోరులో భాగంగా ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కొందరి సంపన్నుల ఆస్తుల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
ఎంటీబీ నాగరాజు: కర్ణాటక చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజు (హొసకోటె)కు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా దాఖలుచేసిన అఫిడవిట్లో తన పేరిట రూ.1,609 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచిన ఆయన అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో (2020లో) ఓడిపోయారు. అనంతరం.. విధానపరిషత్తుకు ఎన్నికై మంత్రిపదవి చేపట్టారు. ప్రస్తుతం హొసకోటె నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఆయన పోటీచేస్తున్నారు. ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు ఏకంగా రూ.500కోట్లు పెరగడం గమనార్హం. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరులో ఉన్న నేతల్లో ఈయనే అత్యంత ధనికుడు. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న ఎం.టి.బి.నాగరాజుకు స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నాయి.
డీకే శివకుమార్: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆస్తులు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆస్తుల విలువ రూ.1358 కోట్లుగా ఉన్నట్లు తాజాగా సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోలిస్తే ఈయన ఆస్తులు కూడా సుమారు రూ.500 కోట్లు పెరిగాయి. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీకేఎస్.. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు ప్రకటించుకొంటున్నారు.
మునిరత్న నాయుడు: కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న నాయుడు రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. తనకు రూ.293 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లకుపైగా పెరగడం గమనార్హం. అయితే, ఆయనకు రూ.100 కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. కార్లు, టిప్పర్లు, బైకులు మొత్తంగా.. 30 వాహనాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
హెచ్డీ కుమారస్వామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కీలక నేత హెచ్డీ కుమారస్వామి కుటుంబానికి రూ.181 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే, గత ఎన్నికల సమయంతో పోలిస్తే కుమారస్వామి, ఆమె భార్య అనిత ఆస్తుల విలువ రూ.14 కోట్లు మాత్రమే పెరిగింది. అంతకుముందు కుమారస్వామి దంపతుల ఆస్తులు రూ.167 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. కనకపుర లోక్సభ స్థానం నుంచి 1996లో లోక్సభకు ఎన్నికైన కుమారస్వామి.. 2004లో రామనగర స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. కాంగ్రెస్, భాజపా సంకీర్ణ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి.. ప్రస్తుతం చెన్నపట్న స్థానం ఉంచి బరిలో దిగుతున్నారు.
బీవై విజయేంద్ర: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకూ రూ.100 కోట్లకు పైనే ఆస్తులున్నాయి. శికారిపుర నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన విజయేంద్రకు రూ.126 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన.. 2020లో భాజపా కర్ణాటక ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి తన తండ్రి యడియూరప్ప ఎన్నికల బరిలో లేకపోవడంతో విజయేంద్రకు శికారిపుర స్థానం ఖాయమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్