కొవిడ్ కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు!
గడిచిన ఏడాదిలో కొవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వెల్లడించిన కేంద్ర రవాణాశాఖ
దిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గడిచిన ఏడాదిలో కొవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ, రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
‘గడిచిన ఏడాది కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా లక్షా యాభైవేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ వల్ల సంభవించిన(1.46లక్షల) మరణాల కంటే ఇది ఎక్కువ కావడం విచారకరం’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా 18 నుంచి 35ఏళ్ల వయసువారే కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్లోనే చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఏటా 4.5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వీటిలో లక్షా 50వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా వేల మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇది వారికి వ్యక్తిగతంగా తీవ్ర నష్టాన్ని కలిగించడంతో పాటు వారి కుటుంబాలకు తీవ్ర ఆవేదనను మిగులుస్తున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా భారత్ దాదాపు 3.14శాతం విలువైన జీడీపీ నష్టాన్ని చవిచూస్తోందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది.
స్క్రాపింగ్ సర్టిఫికెట్తో రాయితీలు..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తుక్కు విధానం(స్క్రాపింగ్ పాలసీ) వల్ల కొత్త వాహనం కొనేవారికి దాదాపు 4నుంచి 6శాతం రాయితీ లభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పాత వాహనాన్ని ఇచ్చి స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందడం వల్ల కొత్త వాహనం కొనేవారికి రోడ్ టాక్సులోనూ రాయితీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత వాహనాలకు 25శాతం, వాణిజ్య వాహనాలకు 15శాతం రాయితీ ఇచ్చే అవకాశాలున్నాయని..వీటికి అదనంగా, స్క్రాపింగ్ సర్టిఫికెట్ ద్వారా కొత్త వాహనాన్ని కొనుగోలుచేసే వారికి రిజిస్ట్రేషన్ ఛార్జీ రద్దు చేసే అంశాన్ని రాష్ట్రాలు పరిశీలించవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. ఇలా కేంద్ర ప్రభుత్వ తుక్కు విధానం వల్ల దేశంలో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు జీఎస్టీ రూపంలో రూ.40వేల కోట్ల ఆదాయం పొందే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి