‘వాక్ స్వేచ్ఛ’పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు.. భాజపా, టీఎంసీ ట్విటర్ వార్
సాధారణంగా వివాదాలకు చాలా దూరంగా ఉండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan).. బెంగాల్లో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువయ్యారు. ‘పఠాన్’ సినిమా వివాదం వేళ.. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆయన మాట్లాడటమే అందుకు కారణం.
కోల్కతా: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ‘పఠాన్ (Pathaan)’ సినిమాపై వివాదం జరుగుతున్న వేళ అమితాబ్ ‘వాక్ స్వాతంత్ర్యం’ పై మాట్లాడటం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC), భాజపా (BJP) నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇంతకీ బిగ్బీ ఏమన్నారు..? ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి? అంటే..
పశ్చిమ బెంగాల్లో కోల్కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే బిగ్బీ ఈ వేడుకలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of Expression)పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అన్నారు. షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రంపై వివాదం జరుగుతున్న వేళ.. అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది.
బిగ్బీ వ్యాఖ్యలపై భాజపా ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కోల్కతాలో మమతా బెనర్జీ వేదికపై ఉండగా.. అమితాబ్ బచ్చన్ మాటలు మరింత ప్రవచనాత్మకంగా ఉండవు. నిరంకుశులకు(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ) అద్దం పట్టినట్లుగానే ఉంటాయి’’ అని విమర్శించారు. ఆ నిరంకుశురాలి(మమత) నాయకత్వంలో ఈ దేశం ఎన్నికల అనంతరం ఘోరమైన హింసను చవిచూసిందని మండిపడ్డారు. బెంగాల్ ప్రతిష్ఠను ఆమె దిగజారుస్తున్నారని ఆరోపించారు.
కాగా.. అమిత్ మాల్వియా ట్వీట్కు తృణమూల్ ఎంపీ నుశ్రత్ జహాన్ (Nussrat Jahan) గట్టిగా బదులిచ్చారు. ‘‘సినిమాలపై నిషేధం విధించడం, జర్నలిస్టులను నిర్బంధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యులను శిక్షించడం.. ఇవే నిరంకుశ పాలన సంకేతాలు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడం కూడా ఆ పాలనకు నిదర్శనమే. ఇదంతా భాజపా హయాంలోనే జరుగుతోంది. కానీ, అమిత్ మాల్వియా మాత్రం ఇతరులను నిందించడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ నుశ్రత్ కౌంటర్ ఇచ్చారు.
షారుక్, దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ‘పఠాన్’ సినిమాకు బాయ్కాట్ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ‘బేషరమ్ రంగ్’ (besharam rang) పాటలో దీపిక ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ భాజపా నేతలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై కోల్కతా ఫిలిం ఫెస్టివల్లో షారుక్ పరోక్షంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలు తరచూ సంకుచిత పోకడలతో విభజన కారక, విధ్వంసక పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.