ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. భగవత్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరెస్సెస్‌ వర్గాలు తెలిపాయి. ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు....

Published : 10 Apr 2021 13:22 IST

నాగ్‌పూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరెస్సెస్‌ తెలిపింది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని పేర్కొంది. ఆయనకు కొవిడ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని