సచిన్ వాజే.. రూం నంబరు 1964
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజే గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజే గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబయిలోని నారిమన్ ప్రాంతంలో గల ఓ ఐదు నక్షత్రాల హోటల్ నుంచి వాజే ‘బలవంతపు వసూళ్ల’ రాకెట్ను నడిపాడని ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడినట్లు తాజాగా తెలిసింది. దీంతో ఈ హోటల్లోని 1964 నంబరు గదిపై అధికారులు దృష్టిపెట్టారు.
ఆ హోటల్లోని రూం నంబరు 1964ను వాజే కోసం ఓ పారిశ్రామికవేత్త 100 రోజులకు బుక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హోటల్ గదికి వాజే.. ‘సుశాంత్ సదాశివ్ ఖామ్కర్’ పేరుతో నకిలీ ఆధార్ కార్డుతో చెకిన్ అయినట్లు తెలిసింది. ‘‘ఈ లగ్జరీ హోటల్ గదిని ఓ వ్యాపారవేత్త.. ట్రావెల్ ఏజెంట్ ద్వారా రూ. 12లక్షలు చెల్లించి వంద రోజులకు బుక్ చేశాడు. గతంలో వాజే ఆ వ్యాపారవేత్తకు కొన్ని వివాదాల్లో సాయం చేశారు. ఫిబ్రవరి నెలలో వాజే ఇదే గదిలో కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్లో విధుల్లోనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫిబ్రవరి 16న వాజే టయోటా ఇన్నోవా కారులో ఈ హోటల్కు వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న క్రూయిజర్ కారులో వెళ్లిపోయారు’’అని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. అదే సమయంలోనే వాజే బృందం ముంబయిలోని పలు ప్రముఖ సంస్థల్లో లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించడం గమనార్హం. ఆ హోటల్ వద్ద వాజే కన్పించిన ఆ రెండు కార్లు ప్రస్తుతం ఎన్ఐఏ స్వాధీనంలో ఉన్నాయి.
ఎవరా మహిళ..
ఇదిలా ఉండగా.. పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ.. గురువారం దక్షిణ ముంబయిలోని ఓ హోటల్, క్లబ్తో పాటు ఠాణె జిల్లాలోని ఓ అపార్ట్మెంట్లోనూ సోదాలు నిర్వహించింది. అదే రోజున ముంబయి ఎయిర్పోర్టులో వాజే సన్నిహితురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుంది. ఠాణెలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించిన అపార్ట్మెంట్ ఆ మహిళ పేరు మీదే ఉంది. దీంతో ఈ మహిళకు.. వాజేకు ఉన్న సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో లేదా మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరో కారు స్వాధీనం..
పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు, మన్సుఖ్ హిరేన్ మృతి కేసుల్లో ఎన్ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోని అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఔట్ల్యాండర్ వరకు 7 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో మెర్సిడెస్ కారును కూడా ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్ కమిషనరేట్తో సంబంధం ఉన్నట్లు తేలింది.
వాజే ‘వ్యాపారం’ గురించి సీనియర్ పోలీసు అధికారుల్లో చాలా మందికి తెలుసట. దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసుల్లో 35 మంది అధికారులను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్