శామ్సంగ్ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ వారసుడు లీ జే-యాంగ్కు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయిన్-హెయికు లంచం
సియోల్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ వారసుడు లీ జే-యాంగ్కు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు నాటి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయిన్-హెయికు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో లీ జే-యాంగ్ అరెస్టు అయ్యారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, తనకు విధించిన శిక్షపై లీ జే-యాంగ్ అప్పీలేట్ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం 2018లో అతడి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, 2019 ఆగస్టులో ఈ కేసు దక్షిణ కొరియా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీంతో లీ జే-యాంగ్ శిక్షను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సమీక్షించాలని సియోల్ హైకోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారణ జరిపిన హైకోర్టు లీ జే-యాంగ్కు రెండున్నర ఏళ్లు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
52ఏళ్ల లీ జే-యాంగ్.. శామ్సంగ్ గ్రూప్ అధినేత లీ కున్-హీ పెద్ద కుమారుడు. తండ్రి లీ కున్-హీ గతేడాది అక్టోబర్ 25న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ తీర్పుతో కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకొనే బాధ్యతల నుంచి కూడా ఆయన తాత్కాలికంగా దూరమయ్యారు. తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రక్రియను కూడా ఆయన పర్యవేక్షించలేరు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.