శామ్‌సంగ్‌ వారసుడికి రెండున్నరేళ్ల జైలుశిక్ష

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ వారసుడు లీ జే-యాంగ్‌కు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గుయిన్‌-హెయికు లంచం

Updated : 18 Jan 2021 15:54 IST

సియోల్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ వారసుడు లీ జే-యాంగ్‌కు రెండున్నర ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల క్రితం అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు నాటి దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గుయిన్‌-హెయికు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై 2017లో లీ జే-యాంగ్‌ అరెస్టు అయ్యారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, తనకు విధించిన శిక్షపై లీ జే-యాంగ్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం 2018లో అతడి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, 2019 ఆగస్టులో ఈ కేసు దక్షిణ కొరియా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీంతో లీ జే-యాంగ్‌ శిక్షను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సమీక్షించాలని సియోల్‌ హైకోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారణ జరిపిన హైకోర్టు లీ జే-యాంగ్‌కు రెండున్నర ఏళ్లు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

52ఏళ్ల లీ జే-యాంగ్‌.. శామ్‌సంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌-హీ పెద్ద కుమారుడు. తండ్రి లీ కున్‌-హీ గతేడాది అక్టోబర్‌ 25న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ తీర్పుతో కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకొనే బాధ్యతల నుంచి కూడా ఆయన తాత్కాలికంగా దూరమయ్యారు. తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రక్రియను కూడా ఆయన పర్యవేక్షించలేరు.  

ఇదీ చదవండి..

శామ్‌సంగ్‌ కొత్త ఆవిష్కరణలు ఏంటో తెలుసా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని