సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు

కరోనా టీకాలపై పేటెంట్లను తొలగించాలని కోరుతూ బ్రిటన్‌లోని న్యూకే బీచ్‌లో జీ-7 నాయకుల సైకత చిత్రాలను

Published : 12 Jun 2021 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా టీకాలపై పేటెంట్లను తొలగించాలని కోరుతూ బ్రిటన్‌లోని న్యూకే బీచ్‌లో జీ-7 నాయకుల సైకత చిత్రాలను ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు రూపొందించారు. ఇసుకలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్  అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజిలా మోర్కెల్ చిత్రాలను గీశారు. వ్యాక్సిన్లపై పేటెంట్లు ఉండటం వల్ల అవి పేద దేశాలకు అందటం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో టీకాలపై మేథో హక్కులు తొలగించేందుకు నాయకులు కృషి చేయాలని ఆవాజ్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని