అన్నాడీఎంకే పదవిపై కోర్టుకెక్కిన శశికళ

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచుతోంది. ఇలాంటి

Published : 18 Feb 2021 14:36 IST

చెన్నై: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచింది. ఇలాంటి సమయంలో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేలోపే అవినీతి కేసులో జైలుకెళ్లారు. దీంతో పళనిస్వామిని సీఎం అయ్యారు. ఆ తర్వాత పళని, పన్నీర్‌సెల్వం వర్గాలు కలిసిపోయాయి. అనంతరం పళని, పన్నీర్‌ సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. అందులో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ నిర్ణయంపై 2017లో ఆమె న్యాయస్థానంలో దావా వేశారు. 

ఇటీవలే జైలు నుంచి విడుదలైన చిన్మమ్మ.. అన్నాడీఎంకే పార్టీని తన హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె జైలు నుంచి విడుదలై చెన్నైకి వస్తున్నప్పుడు కూడా తన కారుపై పార్టీ జెండా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని