కోలుకున్న శశికళ: ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆరోగ్యం కుదుటపడడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

Updated : 31 Jan 2021 14:18 IST

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆరోగ్యం కుదుటపడడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శశికళకు ఈ మధ్యే కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండడంతో డిశ్ఛార్జి చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవించారు. ఈ నెల 27వ తేదీన శిక్షా కాలాన్ని పూర్తిచేసుకున్నారు. విడుదల సమయం దగ్గర పడిన సమయంలోనే ఆమెకు అస్వస్థత నెలకొనడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్ఛార్జి చేస్తున్నట్లు ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. డిశ్ఛార్జీ సమయంలో ఆస్పత్రి వద్దకు ఆమె అభిమానులు తరలివచ్చారు. అయితే, ప్రస్తుతం ఆమె మరికొన్ని రోజులు బెంగళూరులోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో వారం రోజుల తర్వాతే ఆమె చెన్నై వెళ్లే అవకాశాలు ఉన్నట్లు శశికళ సన్నిహితులు వెల్లడించారు. ఇదిలాఉంటే, తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే శశికళ విడుదల కావడంతో రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి..
తమిళనాడు: విద్యార్థులకు ఉచితంగా రోజుకు 2GB డేటా
అధికారంలోకి వస్తే విద్యా రుణాలు రద్దు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని