ISRO: SSLV ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు..
SSLV: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (SSLV) ప్రయోగానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి...
శ్రీహరికోట: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (SSLV) ప్రయోగానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఆదివారం జరిగిన ఈ ప్రయోగం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్ల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ (SSLV) నింగిలోకి దూసుకెళ్లింది. తొలి మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయ్యాయి. కానీ, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే టెర్మనల్ దశలో సంబంధాలు తెగిపోయి సమాచారం లభ్యం కాలేదు. దీంతో తుది ఫలితాల్ని ప్రకటించడానికి ఇస్రో వాయిదా వేసింది. సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరాయో.. లేదో.. ప్రకటిస్తామని సోమనాథన్ ఉదయం ప్రకటించారు
సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలు నిర్దేశించిన కక్ష్యలోకి కాకుండా ఇతర అస్థిర కక్ష్యలోకి చేరుకున్నట్లు గుర్తించామని ఇస్రో మధ్యాహ్నం వెల్లడించింది. దీంతో ఎస్ఎస్ఎల్వీ-డీ1 (SSLV-D1) పేరిట చేపట్టిన ఈ ప్రయోగ పూర్తిస్థాయి లక్ష్యాల్ని చేరుకోలేపోయామని తెలిపింది. ‘‘సెన్సార్ వైఫల్యాన్ని గుర్తించి, దాన్ని నివృత్తి చేయడంలో తలెత్తిన ఓ లాజిక్ వైఫల్యం’’ వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు గుర్తించామని పేర్కొంది. దీంతో ఉపగ్రహాలు నిర్దేశించిన 356 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి కాకుండా 356x76 కి.మీ వలయాకార కక్ష్యలోకి చేరాయని తెలిపింది. ఫలితంగా ఆ ఉపగ్రహాలు నిరుపయోగమైనట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తామని ఇస్రో ప్రకటించింది. పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసి కమిటీ సిఫార్సులు చేస్తుందని పేర్కొంది. వాటిని అమలు చేసి తిరిగి ఎస్ఎస్ఎల్వీ-డీ2 పేరిట ప్రయోగం చేపడతామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.