Satyendar Jain: దిల్లీ ఆరోగ్య మంత్రికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన  దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అక్కడి కోర్టు మరో 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

Updated : 13 Jun 2022 12:12 IST


దిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన  దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అక్కడి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై రేపు దిల్లీ కోర్టు వాదనలు విననుంది. 

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా.. దానిని జూన్ 13 వరకు పొడిగించింది. తాజాగా మరో 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని