Supreme Court: దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేశాం కదా.. ఇదేం ఎంపిక?
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీపై దాఖలపై పిటిషన్లపై బుధవారం
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం
దిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సభ్యుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ తాము ఎంతో కష్టపడి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి, కొందరి పేర్లను సిఫార్సు చేస్తే.. వాటిని కేంద్రం పక్కనబెట్టడంపై ఆగ్రహించింది. ఖాళీల భర్తీ విషయంలో ఇప్పటికే కోర్టు చాలా సహనం పాటించిందని.. రెండు వారాల్లోగా అపాయింట్మెంట్ లెటర్లతో రావాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీపై కోర్టు ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా కేంద్రం పట్టించుకోకపోడంపై గతవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా నియామకాలు చేపట్టాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో కేంద్రం హడావుడిగా పలు ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టి 84 మంది సభ్యులను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్ను సుప్రీంకోర్టు సమర్పించింది.
ఈ అఫిడవిట్ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఖాళీల భర్తీ, ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలోని సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తులను కాకుండా వెయిట్ లిస్ట్లో నుంచి సభ్యులను ఎంపిక చేయడంపై ఆగ్రహించింది. ‘‘ఎన్సీఎల్టీ కోసం సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన జాబితాను చూశాం. ఈ ట్రైబ్యునల్ కోసం 9 మంది జ్యుడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యులను కమిటీ ప్రతిపాదించింది. కానీ ఈ జాబితా నుంచి కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. మిగతా వారిని వెయిటింగ్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. సెలక్ట్ లిస్ట్ను పక్కనబెట్టి వెయిట్ లిస్ట్లో నుంచి సభ్యులను ఎంపిక చేయకూడదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రూల్ ఆఫ్ లా.. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి’’ అని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు.
‘‘ట్రైబ్యునళ్లలో భర్తీల ఇంటర్వ్యూలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అందుకే కొవిడ్ సమయంలోనే మేం దేశవ్యాప్తంగా తిరిగాం. ఎంతో సమయం వెచ్చించి ఇంటర్వ్యూలు చేశాం. అందులో నుంచి కొందరిని ఎంపిక చేసి సెలక్ట్ జాబితాను పంపించాం. కానీ మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. సెలక్ట్ జాబితా నుంచి అందర్నీ నియమించలేమని కేంద్రం చెబుతోంది. మా సమయాన్ని వృథా చేసుకున్నాం’’ అంటూ చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు.
దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నియామకాలు చేపట్టామని తెలిపారు. సభ్యుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలిపారు. అయితే ఇందుకు కోర్టు తిరస్కరించింది. ఈ సమస్యకు కౌంటర్ దాఖలు చేయడం పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రానికి రెండు వారాలు గడువు కల్పిస్తున్నామని, ఆలోగా సరైన సభ్యులతో నియామకాలు చేపట్టి.. అపాయింట్మెంట్ లెటర్లతో తమ వద్దకు రావాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!