SC: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు

Updated : 29 Aug 2022 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఈ విచారణను సెప్టెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. 

ఇదే సమయంలో వాయిదా కోరిన కొందరు పిటిషనర్లను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఇలాంటి ‘ఫోరం షాపింగ్‌’ను అనుమతించమని పేర్కొంది.  హిజాబ్‌ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద వచ్చే తప్పనిసరైన మతాచారం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. కళాశాల తరగతి గదుల్లో హిజాబ్‌ ధరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉడిపిలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని