Supreme Court: పాముకాటుతో చంపించడం ఓ ట్రెండ్ అయ్యింది.. బెయిల్ ఇవ్వలేం..!
ప్రమాదవశాత్తూ పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతాయి. అయితే ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం కోసం పామును ఆయుధంగా
దిల్లీ: ప్రమాదవశాత్తూ పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతాయి. అయితే ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం కోసం పామును ఆయుధంగా వాడుకోవడం క్రూరమైన నేరం అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని రాజస్థాన్కు చెందిన ఓ మహిళ తన అత్తను పాము కాటుతో చంపించిన ఘటనలో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పాములు ఆడించేవారి నుంచి విషపూరితమైన పాములను తీసుకొచ్చి వ్యక్తులను చంపించడం, పాము కాటుతో ప్రమాదవశాత్తూ చనిపోయిందని నమ్మించడం ఇప్పుడో కొత్త ట్రెండ్ అయిపోయింది. రాజస్థాన్లో ఇలాంటి నేరాలు తరచూ జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడం కుదరదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేసు వివరాలివి..
2019లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్లోని ఝంఝున్ జిల్లాకు చెందిన అల్పనకు సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. విధుల రీత్యా అల్పన భర్త దూరంగా ఉండటంతో ఆమె ఝుంఝున్లో అత్త సుబోధ్ దేవితో కలిసి నివసిస్తోంది. సుబోధ్ దేవి భర్త కూడా ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో ఉండేవారు. ఈ క్రమంలోనే అల్పనకు జైపుర్కు చెందిన మనీశ్కు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
అల్పన, మనీశ్ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటంతో అనుమానం వచ్చిన సుబోధ్ దేవి కోడలిని నిలదీసింది. దీంతో తమ ప్రేమకు అడ్డువస్తుందని భావించిన అల్పన.. అత్తను చంపేందుకు ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి కుట్ర చేసింది. మనీశ్ సాయంతో పాములు పట్టేవాడి నుంచి ఓ విషపూరిత పామును తీసుకొచ్చింది. అత్త పడుకున్న తర్వాత పామును మంచం కింద వదిలింది. నిద్రలో ఉన్న సుబోధ్ దేవిని పాము కాటువేయడంతో కన్నుమూసింది. ఆ తర్వాత పాము కాటుతో తన అత్త మరణించినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనుమానం వచ్చిన అల్పన అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అల్పన, ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని 2020లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.