
SC: ప్యానెల్ ముందు ఫేస్బుక్ హాజరుకావాల్సిందే..
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్ జారీ చేసిన సమన్లకు వ్యతిరేకంగా ఫేస్బుక్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ చట్టాల పరిధిలోకి చొచ్చుకుపోకుండా శాంతిభద్రతల అంశంపై విచారించే హక్కు ప్యానెల్కు ఉందని స్పష్టం చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో గతేడాది ఫిబ్రవరిలో దిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. మూడు రోజుల పాటు అల్లర్లు జరిగి దాదాపు 50 మందికి పైగా మరణించారు. దీనిపై దిల్లీ అసెంబ్లీకి చెందిన శాంతిభద్రతల కమిటీ విచారణ నిమిత్తం ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు అజిత్ మోహన్కు సమన్లు ఇచ్చింది. ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై మోహన్ సుప్రీంను ఆశ్రయించారు. ప్యానెల్ ముందు హాజరు కావాలని తనను బలవంతం చేయలేరని వాదించిన ఆయన..దిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం.. ఆయన్ను ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
‘కేంద్ర చట్టాల పరిధిలోకి చొచ్చుకుపోకుండా శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని కోరే హక్కు దిల్లీ ప్యానెల్కు ఉంది. అలాగే సమాధానాలివ్వాలంటూ ఫేస్బుక్ను బలవంతం చేయలేం’ అని సుప్రీం పేర్కొంది. అలాగే ప్యానెల్ ఈ కేసుపై విచారణ మాత్రమే జరపగలదని స్పష్టం చేసింది. ఫేస్బుక్ వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సామాజిక మాధ్యమాల పాత్రపై సుప్రీం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘సామాజిక మాధ్యమ సంస్థలకు ప్రజల్ని ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది. ఈ వేదికపై జరిగే చర్చలకు సమాజాన్ని వర్గాలుగా విడగొట్టే శక్తి ఉంది. సరైన సమాచారం అందుబాటులో లేని వ్యక్తులు..వాటినే వార్తగా భావించే అవకాశం లేకపోలేదు’ అని వ్యాఖ్యానించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్ను పంచుకున్న బిల్ గేట్స్
-
India News
Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
-
Sports News
Virat Kohli: కోహ్లీ వైఫల్యాల వెనుక అదే కారణం..: మిస్బా
-
Movies News
KGF Avinash: కేజీయఫ్ విలన్కు రోడ్డు ప్రమాదం... మీ ప్రేమ వల్ల బతికా: అవినాశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?