Bihar: ఆనంద్ మోహన్ విడుదలపై నీతీశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఐఏఎస్ అధికారి హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలపై వివరణ ఇవ్వాలని బిహార్ (Bihar) ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.
దిల్లీ: ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) విడుదలపై సుప్రీం కోర్టు (Supreme Court) బిహార్ (Bihar) ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలను సవాలు చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, ఆనంద్ మోహన్లకు నోటీసులు జారీ చేసింది.
‘‘మరణశిక్షకు బదులుగా జీవితఖైదు విధించినప్పుడు.. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ శిక్షను కచ్చితంగా అమలు చేయాలి. మధ్యలో నిందితుడికి ఎలాంటి ఉపశమనం కలిగించకూడదు’’ అని ఉమాదేవి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె తరపున న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ ఆనంద్ మోహన్ విడుదల దురదృష్టకరమైన అంశమని వ్యాఖ్యానించారు.
1994లో గోపాల్గంజ్ జిల్లా మెజిస్ట్రేట్గా తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య పనిచేస్తున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసలో ఆనంద్ మోహన్ తన అనుచరులతో కలిసి చేసిన మూక దాడిలో కృష్ణయ్య మృతిచెందారు. ఈ కేసులో నేరం నిరూపణ కావడంతో ఆనంద్ మోహన్కు బిహార్ దిగువ కోర్టు మరణ శిక్ష విధించింది. తర్వాత ఈ తీర్పుపై విచారణ చేపట్టిన పట్నా హైకోర్టు ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడంతో గత 15 ఏళ్లుగా ఆనంద్ మోహన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
గత నెలలో ఆనంద్ మోహన్ విడుదల కోసం నీతీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం జైలు మాన్యువల్లో మార్పులు చేసింది. ఈ క్రమంలో ఆనంద్తో పాటు మరో 27 మంది ఖైదీలను విడుదల చేస్తూ బిహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల 27న ఆనంద్ మోహన్ జైలు నుంచి విడులయ్యారు. దీన్ని సవాలు చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న